
రోజు ఐదు లీటర్ ల నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పరిగడుపున గోరు వెచ్చని నీరు త్రాగడం ఇంకా మంచిది. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మన జీర్ణ క్రియ మంచిగా పని చేస్తుంది. అయితే చాలామంది భోజనం సమయంలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిది కాదని చెబుతుంటారు. ఇది ఇంతవరకు నిజమో తెలుసుకోండి..భోజనం చేసేటప్పుడు చాలామంది నీరు తాగుతుంటారు. ఇది అంత మంచిది కాదని చెబుతారు. అయితే, తగిన మోతాదులో నీళ్లు తాగితే మంచిదే. అంతేకాని ఎక్కువ నీరు తాగకూడదు. దీనివల్ల జీర్ణక్రియ పనితీరు తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి భోజనం సమయంలో ఎక్కువ నీరు తీసుకోవద్దని చెప్పారు. కాబట్టి.. భోజనం ముందు కానీ, తర్వాత అరగంట తేడాతో నీరు తాగాలి. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి.ఒంట్లో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడే ఇలా నీరు తాగాలనిపిస్తుంది. కాబట్టి భోజనం సమయంలో కాకుండా రోజంతా అప్పుడప్పుడు నీరు తాగుతుండాలి. భోజనం సమయంలో మాత్రం తక్కువగా నీరు తాగాలి. ఇక భోజనం మరీ స్పైసీగా ఉన్న నీరు తాగాలనిపిస్తుంది కాబట్టి.. అలా ఉండకుండా ఉప్పు, కారం, మసాలాలు తగ్గించి తినాలి.