
టీ20 ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్లపై విజయం సాధించిన టీం ఇండియా పాకిస్థాన్ అభిమానులు ఓర్వ లేకపోతున్నారు. టీమిండియా గెలుపు ఓర్చుకోలేక సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ సంతోషపడుతున్నారు.

భారత్ కు డు ఆర్ డై గా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ సమయంలో వేసిన టాస్ వీడియోను పోస్ట్ చేస్తూ భారత్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆ వీడియోలో ఆఫ్ఘన్ సారథి మహ్మద్ నబి టాస్ గెలిచాక మొదట బౌలింగ్ చేస్తామని చెప్పినట్లు వినపడుతోంది.
దాన్ని పాక్ అభిమానులు వక్రీకరిస్తూ ఆ వ్యాఖ్య టీమిండియా కెప్టెన్ కోహ్లీ చేశాడని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో కనీసం కోహ్లీ పెదవులు కూడా కదలలేదు. అయినప్పటికీ బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటామంటూ కోహ్లీ చెప్పాడని అంటున్నారు. మహ్మద్ నబి చేసిన వ్యాఖ్యను కోహ్లీ వ్యాఖ్యగా వక్రీకరించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు.