
సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో ఒక రియల్ హీరో. సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకున్నాడు. అలంటి సోనూసూద్ పన్ను ఎగ్గొట్టాడంటూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఐటీ దాడులపై పెదవి విప్పని సోను ఇటీవల స్పందించారు. విషయం ఏదైనా తాను, సంజాయిషీ ఇవ్వ వలసిన పని లేదని, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అని సోనూసూద్ తెలిపారు.
ఈ విషయం పై సోనూసూద్ ట్వీట్ చేశారు.
https://twitter.com/SonuSood/status/1439812368830140419
‘ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను వచ్చే జీతాన్ని మానవ సేవ కోసం వినియోగించమని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్ సంస్థలకు సూచించాను. అలా, మా ప్రయాణం కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత పనుల్లో (ఐటీ దాడులు) బిజీగా ఉండటం చేత మీకు అందుబాటులో లేను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను’ అని సోనూ ట్వీట్ చేశారు.పన్ను ఎగవేత ఆరోపణలతో.. నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు సోనూసూద్ ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే సోనూ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారని ఐటీ శాఖ వెల్లడించింది. మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని అధికారులు పేర్కొన్నారు.