
డ్రగ్స్ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల పట్ల, తన పేరుకి భంగం కలిగించేలా మాట్లాడినందుకు మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా కేసు వేయడం తెలిసిందే. ఈ విషయం పై ఈ రోజు విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది.
డ్రగ్స్, ఈడీ కేసు లకు సంబంధించి కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. వచ్చే నెల 20 కి తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది. డ్రగ్స్ నేపథ్యంలో కొన్నిరోజల కిందట రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేయించుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైట్ చాలెంజ్ విసిరారు. అందుకు దీటుగా బదులిచ్చిన కేటీఆర్, ఆపై రేవంత్ మీద పరువునష్టం దావా వేశారు.