
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మరోసారి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆంధ్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పలు వ్యాఖ్యలు చేశారు. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆయన పలు వివరాలు పోస్ట్ చేశారు. ‘ఎన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా .. రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.. ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీలో ఆర్థికాభివృద్ధి లేదని, నవరత్నాల పేరిట మాత్రం వరాలు కురిపిస్తున్నామని చెప్పుకుంటోందని పవన్ ఓ గ్రాఫ్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. రాబడి లేక ప్రభుత్వం అప్పులు చేస్తోందని, నిత్యావసర సరుకుల ధరలన్నింటినీ పెంచుతోందని పవన్ ట్వీట్ చేశారు.