
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో జనసేన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. ఆయన ఎం మాట్లాడారంటే కర్నూల్ జిల్లా కు దామోదర సంజీవయ్య గారి పెట్టాలన్నారు. అతి తక్కువ సమయం ముఖ్యమంత్రిగా పనిచేసి దామోదరం సంజీవయ్య ఎన్నో సేవలు అందించారని చెప్పారు.
జనసేన పార్టీ ప్రయాణం, ఆశయాల వెనుక కొందరు స్ఫూర్తిప్రధాతలు ఉన్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారిలో బూర్గుల రామకృష్ణరావు ఒకరని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ సమయంలో తెలుగు వారందరూ ఒక్కటిగా ఉండాలని చెప్పారని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నారని చెప్పారు. అటువంటి మహానుభావులే తమకు స్ఫూర్తిప్రధాతలని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి పీవీ నరసింహారావు అని పవన్ అన్నారు. ఎన్నో భూ సంస్కరణలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.