
‘మైత్రీవనం’ అనే సినిమాను రూపొందించిన రవి చరణ్ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం నల్లమల. అడవి నేపథ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దారు. విలన్ పాత్రలతో చాలా మంచి నటనను కనబర్చిన ‘అమిత్ తివారి’ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. భానుశ్రీ హీరోయిన్ గా కనిపించనుంది. అడవిలో తల దాచుకునేవారికీ .. అడవిపై ఆధిపత్యం చెలాయించడానికి కొంతమంది పెద్దలు చేసే ప్రయత్నానికి మధ్య జరిగే పోరాటమే కథలుగా వస్తున్నాయి. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సినిమానే ‘నల్లమల’.
ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. కాలకేయ ప్రభాకర్ కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది 1980నాటి కథ .. ‘నల్లమల’లో అంతర్యుద్ధం మొదలైందంటూ ఈ టీజర్ ను ఆవిష్కరించారు. ‘నల్లమల’లో అప్పటి పరిస్థితులను కళ్ల ముందుంచే ప్రయత్నం చేశారు. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.