
పవన్ కల్యాణ్, రానా కలయికలో రాబోతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి ఇది రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ లో పవన్ కళ్యాణ్ ఒక్కడినే చూపించారు. ఈ నేపథ్యంలో రానా పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ ఒక టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో రానా టీజర్ ఉండొచ్చని అంటున్నారు.
ఈ టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.