
‘మా’ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నటుడు మురళీ మోహన్ ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ ఎన్నికల వ్యవహార శైలి, జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ‘మా’ అధ్యక్ష పదవికి ప్రస్తుతం తరుణంలో పోటీలో వున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ సమర్థులేనన్నది తన అభిప్రాయమని పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని చూసిన సాధ్యం కాలేదని తెలిపారు. వీరిరువురు లో ఎవరు గెలిచినా సరే మా భవన నిర్మాణంతో పాటు సభ్యుల బాగోగుల కోసం శ్రమించాలని సూచించారు.
లోకల్, నాన్ లోకల్ అనే వాదన తీసుకువరావడం విచారకరమని, ఇండస్ట్రీలో ఆ విధమైన తేడా లేదని పేర్కొన్నారు. కళామతల్లి లోకల్, నాన్ లోకల్ అని చూడదని, ఇండస్ట్రీలో అందరూ సమానమేనని అన్నారు. మాలో సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు. లోకల్, నాన్ లోకల్ భేదాలు పోవాలంటే పెద్ద హీరోలు చొరవ తీసుకుని ఇలాంటి విభేదాలను తొలగించే ప్రయత్నం చేయాలని మురళీమోహన్ పిలుపునిచ్చారు.