
రేపు యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్ ఉదయం 11.30 కు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీంటిని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు.
యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రకటిస్తారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు.