
తెలంగాణలో దళితుల సమగ్రాభివృద్ధి కోసం తన చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతానని సీఎం కేసీఆర్ భావోద్వేగం చెందారు. కరీంనగర్ లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా దళితబంధు పథకంపై కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
దళితబంధు పథకంపై సీఎం శ్రీ కేసీఆర్ ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీ హరీశ్రావు, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ గంగుల కమలాకర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/Va0TDTTNon
— Telangana CMO (@TelanganaCMO) August 27, 2021
కేసీఆర్ మాట్లాడుతూ, ప్రాణత్యాగానికి సిద్ధపడి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ‘దళితబంధు’ విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని స్పష్టం చేశారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోవడానికి, సామాజిక వివక్షకు గురవడానికి సమాజమే కారణమని అన్నారు. దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతి కోసం యావత్తు తెలంగాణ సమాజం కదిలిరావాలని పిలుపు నిచ్చారు. పట్టుబట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో పట్టుదలతో అభివృద్ధి చేసుకుంటున్నామని, అంతే పట్టుదలతో దళితుల సమగ్రాభివృద్ధిని కూడా సాధించుకుని తీరతామని అన్నారు.