
గండ్ర గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన గండ్ర 2018లో పార్టీ టికెట్ ఆశించారు. అది దక్కకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమీషన్ల కోసం కేసీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పాలనకు ఇక కాలం చెల్లినట్టే నన్నారు. నక్సలైట్ ఎజెండా తమ ఎజెండా అన్న కేసీఆర్, ఆ ఎజెండా ఏమైపోయిందని ప్రశ్నించారు. తండ్రీకొడుకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు పోలీసులు తమ కార్యకర్తలను అన్యాయంగా కేసుల్లో ఇరికి స్తున్నారని, వారి పేర్లను డైరీలో రాసుకుంటున్నానని హెచ్చరించారు. వడ్డీతో సహా వారికి చెల్లిస్తానని అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అన్న సంగతి ప్రధాని మోదీ కూడా అంగీకరించారని రేవంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంథని, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మధుయాస్కీగౌడ్, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.