
భారత్, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ విజేతగా నిలిచింది. భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని కివీస్ సునాయాసంగా చేధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు శుభారంభం అందించారు.
ముఖ్యంగా కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3 వికెట్లు తీశాడు. మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.