
టీ20 ప్రపంచకప్ 2022 నిర్వహణ కోసం వేదికలు ఖరారయ్యాయి. ఈ మెగాటోర్నీ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. మెగాటోర్నీ లో.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాందేశ్, ఇంగ్లాండ్, టీమ్ఇండియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్టు నేరుగా సూపర్ 12 దశలోకి అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు జరుగుతాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఇటీవలే ముగిసింది.
ఈ మెగాటోర్నీ ట్రోఫీని ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గెలిచి విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాలోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్ లో మ్యాచ్లు జరగనున్నాయి. 45 మ్యాచ్ లతో కూడిన ఈ మెగాటోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబరు 13వరకు జరగనుంది. నవంబరు 9, 10 తేదీల్లో జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లను సిడ్నీ, అడిలైడ్ వేదికగా జరగుతాయి. ఫైనల్ మ్యాచ్ ను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు.