
దేశవ్యాప్తంగా 27,254 కేసులు నిన్న కొత్తగా నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా 3,32,64,175 కేసులు దేశవ్యాప్తంగా నమోదు అయ్యాయి. కాగా, నిన్న 37,687 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 219 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,42,874కి పెరిగింది.
ఇక ఇప్పటివరకు 3,24,47,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతంగా 3,74,269 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 53,38,945 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 74,38,37,643 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.