
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడంటూ ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ, కోహ్లీ స్థానంలో టెస్టు జట్టు నాయకత్వ బాధ్యతలను స్వీకరించబోతున్నాడనే వార్తలు వచ్చాయి. బీసీసీఐ వార్తలను ఖండించింది.
ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ అన్నారు. ఇదంతా రబ్బిష్ అంటూ ఆయన కొట్టిపారేశారు. మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా ఏదీ జరగబోదని అన్నారు. స్ప్లిట్ కెప్టెన్సీ అంశం గురించి బీసీసీఐ సమావేశం కావడం కానీ, చర్చించడం కానీ జరగలేదని చెప్పారు. అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని తెలిపారు. ధుమాల్ స్పందనతో ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయింది.