
మరోసారి కరోనా విజృం బిస్తున్నట్లు తెలుస్తుంది.కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం నిన్న ఒక్కరోజే 46,759 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,49,947కి చేరింది. అలాగే, నిన్న 31,374 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశం వ్యాప్తంగా కరోనాతో మరో 509 మంది మృతి చెందారు.
దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,37,370కి పెరిగింది.దేశం మొత్తంగా ఇప్పటివరకు 3,18,52,802 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3,59,775 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నిన్న 1,03,35,290 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. దీంతో మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 62,29,89,134 కు చేరింది.