
మొన్నటి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న తెలంగాణ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నిన్న హర్యానా గవర్నర్గా ప్రమాణస్వీకారం చేశారు. దత్తాత్రేయను కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ నుండి హర్యానాకు గవర్నర్ గా బదిలీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, చండీగఢ్లోని రాజ్భవన్లో దత్తాత్రేయతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, దత్తాత్రేయ భార్య వసంత, కుమార్తె విజయలక్ష్మి ఇతర కుటుంబ సభ్యులతోపాటు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు తో పాటు ఈటల రాజేందర్, జితేందర్రెడ్డి, వివేక్, రవీందర్రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.