
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ యూపీలో నేతలు రైతులను రాక్షసంగా చంపేసిందని అన్నారు. దీని పై మోడీ అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.దేశంలోని 80 కోట్ల మంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు తీసుకొచ్చారని, అందుకే అన్నదాతలు తిరగబడి ఎర్రకోటపై జెండా ఎగరేశారని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను తొలుత వ్యతిరేకించినట్లు చెప్పిన ముఖ్యమంత్రి.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్కు చలిజ్వరం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారు. దేశ ప్రజల మన్ కీ బాత్ విను మోడీ అని సూచించారు. ఇక సిరిసిల్లలో కూడా దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారని రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మోదీ, కేసీఆర్లను బొందపెడితేనే దేశం, రాష్ట్రంలో శాంతి నెలకుంటుందని అన్నారు. రైతుల హత్యలను మోదీ, అమిత్ షా ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.