
వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా ఈ మధ్య కరోనా వైరస్ మళ్లీ సోకుతోంది. నిజానికి రోగ నిరోధక శక్తి కరోనా వైరస్ ను అడ్డుకోవాలి. కానీ అలా జరగడం లేదు. దీనికి గల కారణాలను తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిగ్గు తేల్చింది. ప్రధానంగా కరోనా టీకా తీసుకున్నాక వచ్చే కేసు ల్లో మరణాలు తగ్గిపోతాయి.
హాస్పిటల్ లో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఐసీఎంఆర్ తాజా గ వెల్లడించింది. తాజా అధ్యయనం ప్రకారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కేవలం 9.8శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని.. 0.4 శాతం కేసుల్లోనే మరణం సంభవిస్తోందని తేలింది. దీన్ని టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం.. మరణాలు జయించవచ్చని అధ్యయనం తేల్చింది.వ్యాక్సినేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా కోవిడ్ తదుపరి థర్డ్ వేవ్ ను కూడా తగ్గించవచ్చని పేర్కొంది. వ్యాక్సిన్ అనంతరం ఇన్ ఫెక్షన్లపై ఐసీఎంఆర్ చేసిన ఈ పరిశోధనలో టీకాలు పొందినా కరోనా పాజిటివ్ గా తేలిన 677మందిని నమూనాలు సేకరించారు. 17 రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకున్నట్టు తేలింది. అయితే రెండోసారి పాజిటివ్ రావడానికి డెల్టా వేరియంట్ కారణమని తేల్చారు. ఈ రకం వైరస్ బారిన ఏకంగా 86.09 శాతం పడ్డారని తేలింది. ఈ రకం వైరస్.. మార్చి-జూన్ నెలలో సామాజిక వ్యాప్తి స్థాయిలో సంక్రమించిందని తేలింది. ఆల్ఫా, కప్పా వేరియంట్ల ప్రభావం తక్కువని తేలింది. దీన్ని బట్టి టీకాలు సురక్షితమని.. తీవ్ర ఇనెఫెక్షన్ ను నివారించడంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు స్పష్టమైందని నీతి అయోగ్ ప్రకటించింది.
హాస్పిటల్ లో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఐసీఎంఆర్ తాజా గ వెల్లడించింది. తాజా అధ్యయనం ప్రకారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కేవలం 9.8శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని.. 0.4 శాతం కేసుల్లోనే మరణం సంభవిస్తోందని తేలింది. దీన్ని టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం.. మరణాలు జయించవచ్చని అధ్యయనం తేల్చింది.వ్యాక్సినేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా కోవిడ్ తదుపరి థర్డ్ వేవ్ ను కూడా తగ్గించవచ్చని పేర్కొంది. వ్యాక్సిన్ అనంతరం ఇన్ ఫెక్షన్లపై ఐసీఎంఆర్ చేసిన ఈ పరిశోధనలో టీకాలు పొందినా కరోనా పాజిటివ్ గా తేలిన 677మందిని నమూనాలు సేకరించారు. 17 రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకున్నట్టు తేలింది. అయితే రెండోసారి పాజిటివ్ రావడానికి డెల్టా వేరియంట్ కారణమని తేల్చారు. ఈ రకం వైరస్ బారిన ఏకంగా 86.09 శాతం పడ్డారని తేలింది. ఈ రకం వైరస్.. మార్చి-జూన్ నెలలో సామాజిక వ్యాప్తి స్థాయిలో సంక్రమించిందని తేలింది. ఆల్ఫా, కప్పా వేరియంట్ల ప్రభావం తక్కువని తేలింది. దీన్ని బట్టి టీకాలు సురక్షితమని.. తీవ్ర ఇనెఫెక్షన్ ను నివారించడంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు స్పష్టమైందని నీతి అయోగ్ ప్రకటించింది.