
వంట సిలిండర్ వాడే వారు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రమే గ్యాస్ సిలిండర్ ను ఫిల్ చేయించుకునే అవకాశం ఉన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చిన ఇతర డిస్ట్రిబ్యూటర్నూ ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఈ రోజు లోక్ సభలో తెలిపింది. కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది.
లోకసభ లో మాట్లాడిన కొందరు ఎంపీలు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ను ఎంపిక చేసుకొనే అవకాశం ఎల్పీజీ సిలిండర్ వాడే వినియోగదారుల కు ఉండదా? అని అడగగా బదులుగా కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ సమాధానం ఇచ్చారు. వినియోగదారులు తమకు నచ్చిన ఇతర డిస్ట్రిబ్యూటర్నూ ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించేలా కేంద్ర సర్కారు నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది అమలయ్యే అవకాశం ఉంది.