
ఐపీఎల్ 14 లో ఈ సీజన్లో మ్యాచ్ సగం మాత్రమే జరిగాయి. ఐపీఎల్ లో పాల్గొన్న జట్లలోని కొందరు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో జరగాల్సిన మ్యాచ్లు అర్దాంతరంగా ముగిసిపోయాయి. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే వున్నాడు. ఇప్పుడు సగంలో ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునప్రారంభం అవనుంది. సెప్టెంబర్ 19 న డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 10న క్వాలిఫయర్ 1, అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్ లు జరుగనున్నాయి. అక్టోబర్ 13న క్వాలిఫయర్ 2 మ్యాచ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.