
శ్రీలంక గడ్డపై జరగబోయే సిరీస్ కి భారత జట్టు సిద్దమవుతుంది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు ఫ్లడ్లైట్ల వెలుగులో ప్రాక్టీస్ మొదలెట్టింది. కొలంబో వేదికగా ఈ ఆదివారం నుంచి భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లాడిన భారత్ జట్టు, తాజాగా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో డే/నైట్ ప్రాక్టీస్ మొదలెట్టింది. భారత్ జట్టులోకి కొత్తగా ఐదుగురు క్రికెటర్లు రాగా, వీరిలో కొంత మందికి డే/నైట్ మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. సిరీస్లో ఇబ్బందిపడకుండా ఉండేందుకు రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు ప్రాక్టీస్ సెషన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న ఫస్ట్ వన్డే జరగనుండగా.. ఆ తర్వాత 20, 23న మిగిలిన రెండు వన్డేలు నిర్వహించనున్నారు. అలానే 25న ఫస్ట్ టీ20, ఆ తర్వాత 27, 29న మిగిలిన రెండు టీ20లు జరగనున్నాయి.
మ్యాచ్ల టైమింగ్స్ విషయానికి వస్తే.? వన్డే మ్యాచ్లు అరగంట ఆలస్యంగా స్టార్ట్ కాబోతున్నాయి. పాత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకి వన్డేలు ప్రారంభంకాల్సి ఉండగా.. తాజా షెడ్యూల్లో మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అవుతాయని శ్రీలంక బోర్డు స్పష్టం చేసింది. అలానే టీ20లు కూడా రాత్రి 7 గంటలకి కాకుండా రాత్రి 8 గంటలకి స్టార్ట్ కాబోతున్నాయి.
మ్యాచ్ల టైమింగ్స్ విషయానికి వస్తే.? వన్డే మ్యాచ్లు అరగంట ఆలస్యంగా స్టార్ట్ కాబోతున్నాయి. పాత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకి వన్డేలు ప్రారంభంకాల్సి ఉండగా.. తాజా షెడ్యూల్లో మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అవుతాయని శ్రీలంక బోర్డు స్పష్టం చేసింది. అలానే టీ20లు కూడా రాత్రి 7 గంటలకి కాకుండా రాత్రి 8 గంటలకి స్టార్ట్ కాబోతున్నాయి.
శ్రీలంకతో సిరీస్కి భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.