
సినిమా రంగంలో నిర్మాతగా రాణించాలని చాలా మందికి ఉంటుంది, కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరు సినిమా నిర్మాణం పై ఆసక్తి చూపించరు . నటీనటులు కూడా నిర్మాతగా వ్యవహరించడానికి ఇష్ట పడరు. డబ్బులు తీసుకొని నటించడానికి రెడీ అంటారు కానీ, డబ్బు ఇచ్చి నిర్మాతగా మారండంటే భయపడతారు. ఈ మధ్య ట్రెండ్ మారింది. హీరో నాని నిర్మాత గ మారి ‘హిట్’, ‘అ’ సినిమాలు నిర్మించాడు అవి హిట్ అయ్యాయి . ఇపుడు అదే బాటలో హీరోయిన్ లు నడిచేలా వున్నారు. కథానాయికలు కూడా పెట్టుబడి పెట్టడానికి రెడీ అంటున్నారు. ఇప్పుడు తాప్సి కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రంజల్ అనే తన స్నేహితుడుతో కలసి ‘
అవుట్ సైడర్స్'
అనే సంస్థ ను స్థాపించింది. త్వరలోనే ఓ సినిమాని తమ సంస్థ ద్వారా నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. అయితే.. అందులో ఎవరు నటిస్తారు? ఆ సినిమా ఏ భాషలో రాబోతోందన్న విషయాలు మాత్రం ప్రకటించలేదు. పింక్
, బద్లా
లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది తాప్సి. తాను ఇప్పుడు ఓ పాన్ ఇండియా స్టార్. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికల్లో తాప్సి కూడా వినిపిస్తుంది. తాను హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం!