
‘మా’ ఎన్నికలు జనరల్ ఎన్నికల తరహాలోనే సాగాయి. ఈ సారి మా ఎన్నికల్లో అనేక విషయాలు తెరపై వచ్చాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు ఘన విజయం సాధించారు. మా ఎన్నికలను రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేస్తున్నారనే చర్చ కూడా నడిచింది. ఇదే నిజం చేస్తూ తాజాగా మా ఎన్నికలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. “మా” అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికీ శుభాకాంక్షలు.. తెలిపిన ఆయన.. ఈ ఎన్నికల్లో జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన “మా” ఓటర్లకు ధన్యవాదాలు.. అంటూ ప్రకాష్రాజ్పై సెటైర్లు వేశారు.
భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది అంటూ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. “మా” ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు.. మా ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు.. అందరికి అభినందనలు.. భారత్ మాతాకి జై ! అంటూ ట్వీట్ సంజయ్ చేశారు.