
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వల్ల మూతపడ్డ పాఠశాలలు ఈ రోజు తెరుచుకోనున్నాయి.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పున ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ జాగ్రత్తలు చేపట్టింది. పాఠశాలల వారీగా కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా పిల్లలను అనుమతిస్తారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో తరగతులకు హాజరు కావాలి. విద్యార్థులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలి. పాఠశాల లోపల, బయట పరిసరాల్లోనూ పూర్తిస్తాయిలో శానిటైజ్ చేయించారు.