
హుజురాబాద్ హీట్ తెలంగాణా రాజకీయాల్లో చాలానే ఉంది. ఈ రోజు హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి గ చేసిన పాడి కౌశిక రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయం లో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనను ఎన్నో విధాలుగా అవహేళన చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తన శరీర భాగాలను కూడా కించపరుస్తూ కామెంట్లు చేశారని, అయినా తాను భయపడలేదని, వెనకడుగు వేయలేదని చెప్పారు. ఎవరేమనుకున్నా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇదొక ఫక్తు రాజకీయ పార్టీ, మఠం కాదని అని అన్నారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు హుజూరాబాద్ ఉపఎన్నికల కోసమే ప్రారంభించారనే విమర్శలకు సమాధానంగా, ఎన్నికల్లో లాభం చేకూరడం కోసం ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలవలేని పార్టీలే వివిధ హామీలు ఇస్తుంటే, గెలిచే పార్టీ అయిన మేము ఎందుకు ఇవ్వమని ఆయనఇదొక ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని కేసీఆర్ విమర్శించారు. ఒకప్పుడు చెట్లను కొట్టడమే కానీ, పెంచడం ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో పచ్చదనం పెరిగిందని, ఇన్ని చెట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. 12,769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు గ్రామాల్లో చెత్తను ఎత్తేస్తున్నారని చెప్పారు.