
కర్ణాటక రాజకీయాల్లో ఈ రోజు కీలక మలుపు చోటు చేసుకోబోతుంది. ఆ రాత్రి ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్ప రాజీనామా అంశం ఈ రోజు తేలనుంది.ఆయన రాజీనామా చేస్తారా లేదా అనేది ఈ రోజు తెలిసే అవకాశం వుంది. యడియూరప్ప గురించి బీజేపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుందో ఈ రోజు తెలియనుంది. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్ఠానం కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్లిన యడియూరప్ప బీజేపీ అధిష్ఠానాన్ని కలిసి చర్చలు జరిపారు. ఈ నెల 25న బీజేపీ అధిష్ఠానం తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అనుసరించి నడుచుకుంటానని స్పష్టం చేశారు. బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో రేపు తన కార్యాచరణ గురించి ప్రకటిస్తానని ఆయన అన్నారు. దీంతో రేపు కర్ణాటక నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో యడియూరప్ప సర్కారుకు రేపటితో రెండేళ్లు పూర్తవుతాయి.