
భారత క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు పతకాలు సాధించింది ఐదుగురు
కాగా ఇంకా ఎంతో మంది తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ కొద్దిలో పతకం చేజార్చుకున్న వారు ఉన్నారు. అయితే వీరి స్ఫూర్తిదాయకమైన ఆటతీరు… విజయం సాధించకపోయినా దేశం మొత్తంలో క్రీడల పట్ల సరైన స్ఫూర్తి ప్రేరణ తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శనివారం నాడు నలుగురు భారత అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో దేశానికి పతకం అందించేందుకు పోరాడుతున్నారు. వీటిలో ఒక్క రెజ్లింగ్ మినహాయించి మిగిలిన విభాగాల్లో ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఒక్క పతకం కూడా గెలవలేదు.
శనివారం నాడు జరిగే గోల్ఫ్ క్రీడలో భారతదేశపు తొలి ఒలింపిక్ పతక విజేత అయ్యే అపూర్వ అవకాశం ముంగిట నిలిచి ఉన్న గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ ఆట మీదే అందరి దృష్టి నెలకొంది. మూడో రౌండ్ తర్వాత ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఇటు నీరజ్ చోప్రా కూడా జావెలిన్ త్రో ఫైనల్ కి అర్హత సాధించింది. ఉదయం అదితి అశోక్ పోటీ ముగిసిన తరువాత భారత క్రీడా ప్రేక్షకులంతా ఈ పోటీల్లో తమ దేశం తొలి పతకం సాధించాలని అశిస్తున్నారు.