
భారత హాకీ జట్టు టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించింది. జర్మనీతో జరిగిన మ్యాచ్లో 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తర్వాత దేశానికి కాంస్య పతకం అందించింది. తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి భారత జట్టు విజయం సాధించింది. జర్మనీ నాలుగు గోల్స్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. కాగా, భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడం తో జర్మనీ కి మరో గోల్ దక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి. చారిత్రక విజయాన్ని అందించిన మన్ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆనందంతో భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టారు మరోవైపు, ఓడిన జర్మనీ ఆటగాళ్లు మైదానంలోనే కుప్పకూలి విలపించారు.