
తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు ఆయన అనుచరులు భారీ షాక్ ఇచ్చారు. ఇల్లంతకుంట మండలం ఎంపీపీ పావని తో పాటు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోట పోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్లు టీఆర్ఎస్లో చేరారు. ఇల్లందకుంట టీఆర్ఎస్ మండల ఇంచార్జ్, ఎమ్మెల్యే రవి సుంకర ఆధ్వర్యంలో వీరంతా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తాజాగా ఈటెల రాజేందర్ తన పాదయాత్రను ఇల్లంతకుంట నుండి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయనకు అనుచరులు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్పార్టీలో ఉన్న ఈటెలకు పరాభవం జరిగిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం ఈటెల వెంటే ఉన్నారు. ఇన్ని రోజులు ఇల్లంతకుంట మండలం ఎంపీపీ పావని, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్లు కూడా ఈటల వెంటే నడిచారు. కానీ ఇప్పుడు వీరు బీజేపీని వీడి కారెక్కారు. త్వరలో హుజూరాబాద్లో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీరంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీకి భారీ షాక్ తగిలినట్టైంది.