

ఈ క్రమంలోనే హార్దిక్ ను రిలీజ్ చేసేందుకు ముంబై నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ అధికారి ఒకరు చెప్పారు. రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, కైరన్ పొలార్డ్ లను జట్టులోనే ఉంచుకోవాలని నిర్ణయించిందన్నారు. బ్యాటింగ్ లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ (స్కై), ఇషాన్ కిషన్ లలో ఒకరిని రిటెయిన్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బ్యాటింగ్ లో హార్దిక్ పెద్దగా ఫాంలో కూడా లేడని, అప్పుడప్పుడు జట్టులోకి వస్తున్నా బౌలింగ్ చేయడం లేదని, ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ అతడిని రిలీజ్ చేసిందని చెబుతున్నారు. ఒకవేళ అతడిని తీసుకోవాలని అనుకున్నా వేలంలో తక్కువ ధర పలికితేనే అతడిని జట్టులోకి తిరిగి తీసుకునే చాన్స్ ఉందని తెలిపారు. స్కై లేదా ఇషాన్ లలో ఒకరిని రిలీజ్ చేసినా.. అతడిని వేలంలో ఎక్కువ పెట్టి తీసుకునేందుకైనా ముంబై ఇండియన్స్ సిద్ధమైనట్టు సమాచారం.