
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు రాశారు. టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని హిందుపురం ఎంపీ గోరంట్ల మాాధవ్ బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం ఉదయం 11.50 గంటల సమయంలో లోక్సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉన్న నా దగ్గరకు వచ్చిన ఎంపీ మాధవ్ అసభ్య పదజాలంతో దూషించినట్లు లేఖలో పేర్కొన్నారు.
‘పార్లమెంటు సెంట్రల్ హాలులోని సీసీ టీవీలను పరిశీలిస్తే నన్ను బెదిరించే దృశ్యాలు కనిపిస్తాయి. సభా నాయకుడిగా ఉన్న మీ దృష్టికి వాస్తవాలను తీసుకొస్తున్నా. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని రఘురామ కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన మాధవ్ బెదిరించారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాణ హాని ఉన్నందున రక్షణ కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా మాధవ్పై చర్యలు తీసుకోవాలని సభాపతికి రాసిన లేఖలో రఘురామకృష్ణరాజు కోరారు.
కేంద్రం విడుదల చేసిన ఉపాధి నిధులను ఇతర పథకాలకు మళ్లించారని ప్రజలు అభిప్రాయపడుతున్నందున వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.